విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా 2000వ సంవత్సరం ఆగస్ట్ 28న హైదరాబాద్ బషీర్బాగ్ వద్దా నిరసన తెలిపిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువుల బాసిన విషయం తెలిసిందే... ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో గురువారం సిఐటియు జిల్లా ప్రధాన పి తేజేశ్వరరావు ఆధ్వర్యంలో అమరులైన కామ్రేడ్స్ కు నివాళులర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు అంటూ ప్రతిజ్ఞ చేశారు.