బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు విజయ్ అన్నారు .అనంతరం వారు సంకాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.