అంబర్పేటలో ప్రతిష్టించిన గణనాథుడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గణనాథుడిని నియమనిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.