కరీంనగర్ కలెక్టరేట్ లో నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద బుధవారం సాయంత్రం 7గంటలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏవో సుధాకర్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఖాళీ చరణ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.