Download Now Banner

This browser does not support the video element.

సారా కేసులలో పట్టుబడిన బైక్ ల బహిరంగ వేలం, పాల్గొని దక్కించుకోండి: ఆండ్ర ఎస్సై సీతారాం

Salur, Parvathipuram Manyam | Sep 7, 2025
పలు సారా కేసులలో పట్టుబడిన మోటారు బైక్ లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాలూరు నియోజకవర్గం లోని మెంటాడ మండలంలో ఉన్న ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో, గతంలో నాటు సారా తరలిస్తూ పట్టుబడిన ఆరు మోటర్ బైక్ లను ఈనెల 8వ తేదీ సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామన్నారు. వేలంపాటలో వాహనాలను దక్కించుకోవాలనుకునేవారు నేరుగా ఆండ్ర పోలీస్ స్టేషన్ కు సోమవారం ఉదయం 10 గంటల లోగా రావాలన్నారు. విధిగా ఆధార్ కార్డుతో వచ్చి వాహనాలను పరిశీలించి, వేలంపాటలో పాల్గొనాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us