ఏలూరు జిల్లా దెందులూరు మండలం సింగవరం సమీపంలోని 16వ జాతీయ రహదారిపై గరుడా హోటల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది