తేదీ 08-09-2025 సోమవారం నాడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, గాజువాక వారు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో దాడులు చేసి ఒక డిఫెన్స్ లిక్కర్ కేసు పట్టుకోవడం జరిగింది. ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, గాజువాక వారు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో నిర్వహించిన దాడుల్లో 46 డిఫెన్స్ మద్యం బాటిళ్లు(750ml పరిమాణం)లతో ఒక వ్యక్తి శరగడం దుర్గాప్రసాద్ s/o సత్యనారాయణ మూర్తి R/o: ఇందిరా కాలనీ, శ్రీహరిపురం, విశాఖపట్నం ను పట్టుకొని, అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం రిమాండుకు తరలించడం జరిగింది.