పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జం పాడు గ్రామంలో భారీ వర్షాల వల్ల పత్తి పంట బాగా దెబ్బతిన్నది. ఈ సందర్భంగా రైతు మారం వెంకట్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాట్లాడుతూ మరో 20 రోజుల్లో పత్తి పంటను పీకువేసి మొక్కజొన్న వేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటల వరకు మాత్రమే దిగుబడి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు.