Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవశ్యం శ్రీకాకుళం డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె. హరిబాబు

Srikakulam, Srikakulam | Sep 9, 2025
సమాజంలో అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందించాలంటే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా న్యాయ సేవా సదన్‌లో జరిగిన ఈ సమావేశంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్స్‌జెండర్లు, గిరిజనులు, అసంఘటిత కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రయోజనాలపై చర్చించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us