Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: జిల్లాలోని వెనుగుమట్లలో ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన జిల్లా ఉద్యాన,పట్టుపరిశ్రమ అధికారి జి. శ్యాంప్రసాద్-రైతులకు సూచనలు

Jagtial, Jagtial | Aug 30, 2025
జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్ల  గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలను  జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి. శ్యాంప్రసాద్, ఉద్యాన అధికారి  కె. స్వాతి, లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయ్ భరత్ పరిశీలించారు.ఈ సందర్బంగా శ్యామ్ ప్రసాద్  అయా రైతులతో మాట్లాడుతూ... ప్రస్తుతం 30 నెలల వయసున్న ఆయిల్ పామ్ తోటల్లో పూత తీసివేయకుండా ఉంచుకోవాలని, త్వరలో ఆ తోటలలో పరాగ సంపర్కం కోసం పురుగులను విడుదల చేస్తామని తెలిపారు. చెట్ల పాదులలో ఎలాంటి గడ్డి మందులు పిచికారీ చేయవద్దని, మట్టలు కోయవద్దని సూచించారు. అలా చేసినచో మగ పూత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు .
Read More News
T & CPrivacy PolicyContact Us