Araku Valley, Alluri Sitharama Raju | Aug 26, 2025
ఆది దేవుడు వినాయకు నికి తొలి పూజకు భక్తులంతా సన్నద్ధమయ్యారు. జిల్లాలో గిరి గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. వాడవాడలా మండపాలను సిద్ధం చేశారు. పాడేరు, అరకులోయ పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రతి వీధిలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే వినాయక విగ్రహాలను తెచ్చుకొని బుధవారం వినాయక చవితి పండగ నాడు విగ్రహాల ప్రతిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించారు.