మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త విజయానంద రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం చేసేలా చూడాలని జగన్ ఆదేశించినట్లు వెల్లడించారు.