విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంతో ప్రతిఘటించాలని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు జె అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ 10 వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 6, 7 తేదీలలో రూర్కెలా లో జరుగుతున్న సందర్భంగా నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఉపాధ్యక్షులు జె అయోధ్యరామ్ ప్రవేశపెట్టగా తమిళనాడు సిఐటియు కార్యదర్శి పన్నీర్ సెల్వం బలపరిచారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలియజేశారు.