విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ, పోలీసులు సోమవారం విజిలెన్స్ దాడులు నిర్వహించారు. తొలుత ఎరువుల దుకాణానికి సంబంధించిన రికార్డులు పరిశీలించి అనంతరం స్టాకును లెక్కించారు. ఈ దాడుల్లో సుమారు రూ.16 లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేసినట్లు ఏడీఏ చంద్ర రావు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్నారు. FCO, EC యాక్ట్కి సంబంధించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.