కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి తో పాటు 26 గొర్రెలు మృత్యువాత పడ్డాయి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుకుంటూ రహదారిపైకి రాగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు దేవుని పల్లి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.