మోపిదేవిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఓ సామాజిక వర్గానికి చెందిన వారు తమ ఇంటిని ఆక్రమించి దాడి చేశారు. బాధితుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి ఆక్రమణ విషయమై కొంతకాలంగా వివాదం నడుస్తున్నా పోలీసులు మాత్రం ఆ వర్గానికి అండగా ఉంటున్నారన్నారు. బాధితుడిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.