కడప జిల్లా జమ్మలమడుగు టిడిపి కార్యాలయంలో శనివారం జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు తెలిపిన సమస్యలను విని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.