ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూసమస్యలను తక్షణం పరిష్కరించాలని, సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం గిరిజనులు, పలు సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం అమలు చేసి ఎన్టీఆర్ భూములు గిరిజనులకు అందజేసి పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు చేయాలన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు తీసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.