నంద్యాల జిల్లా యాగంటిలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి, అమ్మవార్లకు సోమవారం పల్లకి సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ గావించి పల్లకిలో కొలువుతీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు తదితరులు ఉన్నారు.