కోనసీమ వ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అమలాపురంలోని కలెక్టరేట్ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, సఖినేటిపల్లి మండలంలో అత్యధికంగా 13 మి.మీ వర్షపాతం నమోదైంది. రాయవరం, ఆత్రేయపురం మండలంలో అత్యల్పంగా 2.0 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 5.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.