రాజోలు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి సబ్ స్టేషన్ల వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు షరతులతో కూడిన మెమొరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీఐటీయూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.