ఈ నెల 25న బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్తీ తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ శుక్రవార తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో శ్రీకాకుళం, విశాఖ, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.