జగిత్యాల జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో ట్రాన్స్జెండర్ల చే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడం జరిగింది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజా సేవా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....“గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందించే మంచి సందేశం వెళ్తుంది అని పేర్కొన్నారు. తమదైన జీవనశైలిలో ఉండే వీరికి సమాజంలో వివక్షను పోగొట్టడానికి ట్రాఫిక్ వీధుల్లోకి తీసుకోవడం జరిగింది అని అన్నారు.