Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
వింజమూరు సర్వే నంబర్ 271లో 42 సెంట్ల వాగు పోరంబోకు భూమిలో నిర్మించిన దేవస్థానం స్థలంలో నిర్మాణాలు సాగుతున్న దేవాలయాల విషయంలో వింజమూరు చెందిన ఓ వ్యక్తి అడ్డంకులు సృష్టిస్తున్నారని శ్రీహరి అనే వ్యక్తి వాపోయారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పిఆర్ఎగా చెప్పుకుంటూ దేవస్థానం కట్టాలని చందాలు వసూలు చేస్తూ దందాలకు పాల్పడుతున్నాడన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని MLAను కోరారు.