గుర్రంకొండ మండలం గుర్రంకొండ పట్టణంలోని జూనియర్ కళాశాలలో నేత్రధానం పై విద్యార్థులకు అవగాహన ర్యాలీ డాక్టర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బుచ్చి రెడ్డి మరియు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ జాతీయ నేత్రధాన పక్షోత్సవాలలో భాగంగా డి. ఎమ్. హెచ్. ఓ వారి ఆదేశాల మేరకు జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కమలాకర్ అధ్యక్షతన సోమవారం జూనియర్ కళాశాల విద్యార్థులకు నేత్రధానం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, ఎవరు నేత్రధానం చేయవచ్చు, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.