శనివారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రభుత్వం నడుం బిగించిందని నియోజకవర్గంలో ఒక్క పూరిగుడిసె లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద సంఖ్యల హాజరయ్యారు.