అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విగ్నేశ్వర స్వామి వారిని పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.