ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సచివాలయాల సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే గోండు శంకర్రావు ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిబ్బందితో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు అందించడం జరుగుతుందని వివరించారు. పథకాలన్నీ అర్హులకు అంతే దిశగా సిబ్బంది పని చేయాలని ఆయన నిర్దేశించారు.