ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో గుబ్బల మంగమ్మ ఆలయం నీట మునిగింది. శనివారం సాయంత్రం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండ వాగులు పొంగిపొర్లాయి. వరద నీరు ఆలయం మీదుగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారులు వరద ప్రభావంతో మూసుకుపోయాయి. కొరసవారిగూడెం అటవీ ప్రాంతంలోని ఈ ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు.