కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులల్లో భాగంగా శుక్రవారం 5వ రోజు శ్రీ వన విహారి దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్బంగా ఆలయ పూజారులు ఆలయంలో అమ్మవారికి ఉదయం నుండి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.