బాల్కొండ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ లో సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు షిటీం కానిస్టేబుల్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్ 8712659795కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వ