శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తో రావడ కృష్ణారావు(53) మృతి చెందాడు. గృహనిర్మాణ పనులు చేస్తుండగా... ఇనుప చువ్వలు పై నున్న 11 కెవి విద్యుత్ వైర్లను తాకడంతో ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుని భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కి రాము తెలిపారు.