నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న మందుల గదికి వెళ్లి నిల్వ ఉన్న వివిధ రకాల మందులను ఆయన పరిశీలించారు. మందుల నిల్వల రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టిక, ఓపి రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. మందుల జాబితాను చూశారు, పక్కనే ఉన్న టీకాల గదిలోకి వెళ్ళి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పలు వ్యాక్సిన్లను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోని క్యాబోరేటరీ, ఇంజెక్షన్, డ్రెస్సింగ్ రూమ్, ప్రసూతి గది, ఇన్ పేషెంట్ గదులను పరిశీలించారు.