Download Now Banner

This browser does not support the video element.

చింతూరు: కూనవరం మండలంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 3, 2025
వరద బాధితులు బియ్యం, నిత్యవసర వస్తువులను అందించాలంటూ కూనవరం మండ‌ల సీపీఎం ఆద్వ‌ర్యంలో వ‌ర‌ద‌బాదితులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. బుధ‌వారం సాయ‌త్రం ఈ మేర‌కు వ‌ర‌ద బాదితులు జాలరి బజారు నుండి ర్యాలీగా టేకులబోరు తాసిల్దార్ కార్యాలయం వద్ద వ‌ర‌ద‌బాదితులు నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్బంగా వ‌ర‌ద‌బాదితులు మాట్లాడుతూ త‌మ‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు అంద‌క చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, వ‌చ్చిన ప్ర‌తీ అధికారికి త‌మ గోడు చెబుతున్న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోయారు. అధికారులు త‌క్ష‌ణ‌మే స్పందించి త‌మ‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు, బియ్యం అంద‌జేయాల‌ని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us