భారీ వర్షాలకు ఇంద్రవెల్లి మండలంలోని సట్వాజీ గూడా వాగు ఉప్పొంగీ ప్రవహిస్తుంది. ఓ ఆటో డ్రైవర్ వాగు దాటే ప్రయత్నం చేయగా వరద తాకిడి పెరగడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు కొంత దూరం వరకు వరదలో కొట్టుకుపోగా స్థానికులు వారిని రక్షించాగా, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు.