యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి చిట్యాల ప్రధాన రహదారి వద్ద లోలేవల్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ఉధృతంగా శుక్రవారం ఉదయం ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి నుంచి భువనగిరి వైపు బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి చిక్కుకున్నాడు. వెంటనే గమనించిన పోలీసులు స్థానికులు అతడిని బైకును బయటికి తీశారు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.