కోనసీమలోని లంక ప్రాంతాలలో వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మరలా పెరుగుతూ ఉండడంతో లంక ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే వచ్చిన వరదకు ముంపునకు గురైన లంక ప్రాంత పంట పొలాలు, మరలా నీటిలోనే మగ్గుతున్నాయి. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక శుక్రవారం ఉదయాన్నే కూలి పనులకు వెళ్లే వారు వరద నీటిలోనే పడవలపై ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు.