మంత్రాలయం: మండలం నాగలదిన్నె రోడ్డులో ముంపునకు గురైన దరివంక ను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మార్వో రమాదేవి గురువారం పరిశీలించారు. చిక్కుకున్న ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో బయటకు లాగారు. వర్షాలకు సంబంధించిన ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జనార్దన్ స్వామి, వీఆర్వో భీమన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.