Download Now Banner

This browser does not support the video element.

అరకులోయ APR కళాశాల,పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

Araku Valley, Alluri Sitharama Raju | Sep 12, 2025
అరకులోయలో గిరిజన గురుకుల కళాశాల పాఠశాలను అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. హాస్టల్ పరిస్థితులను గదుల్లో సందర్శించి స్వయంగా విద్యార్థులకు వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ వర్షం వస్తే భవనం కారిపోతుందని వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పాత భవనం కావడంతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us