అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.