నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ అజిత వెజెండ్లని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా జిల్లాకు ఎస్పీ గా వచ్చిన అజితని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసిన ఎంపీ, ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై మాట్లాడారు. రౌడీ షీటర్ల పై ఉక్కు పాదం మోపాలని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరోధించాలని ఈ సందర్భంగా ఎంపీ ఎస్పీని కోరారు.