తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో బుధవారం అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. కిషోర్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి సూళ్లూరుపేట వస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కాస్తంత వర్షం పడటంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్ పై వస్తున్న కిశోర్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సూళ్లూరుపేట వైద్యశాలకు తరలించారు.