చంపాపేట డివిజన్లోని క్రాంతి నగర్ లో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ పనులను కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో రహదారులను అధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని చంపాపేట డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని అన్నారు.