రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు భూమి లేకుండా చేస్తున్న బడా బాబుల నిర్వాహకంపై మండిపడ్డారు. బతకడానికి డబ్బులు సంపాదించుకుంటే చాలని అడ్డగోలు సంపాదనలో పడి భవిష్యత్తు తరాలను నాశనం చేయవద్దన్నారు. భవిష్యత్తు తరాలను నాశనం చేయొద్దని భవిష్యత్తు తరాలకు భూములు కొనడం ప్రతి భూమిని ఇంటి స్థలంగా మార్చితే పచ్చని నేలలో పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు.