Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: కలెక్టరేట్ లో ఘనంగా కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు:జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

Nirmal, Nirmal | Sep 9, 2025
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మంగళవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలకు ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు. ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us