ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఆదివారం పర్యటకుల తాకిడి అధికంగా నెలకొంది. సెలవ రోజు కావడంతో పర్యటకులు ఉదయం 9 గంటల నుంచి సముద్ర తీరానికి భారీగా తరలివచ్చారు. అలల ఉధృతి సాధారణంగా ఉండడంతో పర్యటకులు ఉత్సాహంగా ఈత కొట్టేందుకు ఆసక్తి కనబరిచారు. పర్యటకులు ఈత కొట్టేందుకు సముద్రం లోపలికి వెళ్లకుండా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.