ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠంలో సంకీరనోత్సవం నిర్వహిస్తున్నట్లు జ్యోతిర్ వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. రాత్రి 9 గంటల 56 నిమిషాల నుండి ఒకటి గంటల 26 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని ఈ సమయంలో భగవత్ ఆరాధన సంకీర్తన చేయడం ద్వారా అనేక పుణ్యాలు పొందవచ్చని ఆయన తెలిపారు.