మంగపేట మండలంలో ప్రధాన రహదారిపై ఇసుక లారీల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం అటువైపు వచ్చిన ఓ అంబులెన్స్ రెండు వైపులా ఉన్న ఇసుక లారీల కారణంగా వెళ్లలేక మధ్యలో చిక్కుకుంది. కాగా అంబులెన్స్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఉన్నారని స్థానికులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.