ట్యాంక్ బండ్ వద్ద హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజులపాటు ప్రణాళిక బద్ధంగా అందరూ వ్యవహరించారని నిమజ్జనాన్ని విజయవంతం చేసినందుకు అసర్నిశలు కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణనాథుడి నిమజ్జన ఉత్సవాలు విజయవంతం చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.