కోవూరు మండలం పడుగుపాడు లోని పుచ్చలపల్లి సుందరయ్య కల్యాణమండపం సమీపంలో శనివారం సాయంత్రం బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నెల్లూరులోని మూలపేటకు చెందిన విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. నార్త్ రాజుపాలెం నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన విష్ణు నీ నెల్లూరులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.